TDP Leader: వైసీపీ నేతలకు న్యూడ్ షోలు ఎక్కువయ్యాయి
ABN , First Publish Date - 2022-08-19T19:56:02+05:30 IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla madhav)పై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ (Pucha Vijay Kumar) స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతల (YCP Leaders)కు న్యూడ్ షోలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. ‘‘తాడేపల్లిలోని జగన్ రెడ్డికి లుంగీలు పంపుతున్నాం.. వాటిని నీ ఎంపీలకు పంపు’’ అని అన్నారు. వైసీపీ ఎంపీలు (YCP MPs), మంత్రలుకు కామం ఎక్కువై వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పరువు తీసిన ఎంపీ, మంత్రులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు జగన్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఏపీ మహిళలను అక్కచెల్లెమ్మలు అనే హక్కు జగన్ రెడ్డి (CM Jagan reddy) కోల్పోయారన్నారు. మహిళా పక్షపాతినని చెప్పుకుంటూ... కామాంధుల పక్షపాతిగా జగన్ రెడ్డి (Jagan mohan reddy) వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ (YCP)ని రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర్లోనే ఉందని పుచ్చ విజయ్ కుమార్ అన్నారు.