రక్షణ కల్పించండి ... టీడీపీ నేత సైదు గోవర్ధన్‌

ABN , First Publish Date - 2022-06-28T04:55:42+05:30 IST

కొల్లేరు ప్రాంత తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు సైదు గోవర్ధన్‌ కుటుంబ సభ్యులతో కలిసి సోమ వారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.

రక్షణ కల్పించండి ... టీడీపీ నేత సైదు గోవర్ధన్‌
కలెక్టరేట్‌ వద్ద బాధితులు

ఏలూరు రూరల్‌, జూన్‌ 27 : కొల్లేరులో తవ్వుతున్న అక్రమ చెరువు లకు అడ్డు తగులుతున్నాననే కారణం తో దెందులూరు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో శ్రీపర్రు గ్రామానికి చెందిన కొందరు నేతలు తనను, తన కుటుంబాన్ని అంతమొందించాలని చూస్తున్నారని కొల్లేరు ప్రాంత తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు సైదు గోవర్ధన్‌ కుటుంబ సభ్యులతో కలిసి సోమ వారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. గోవర్ధన్‌ మాట్లాడుతూ ఇటీవల కొల్లేరు, ఆగడాలలంక గ్రామాల్లో సొసైటీ భూముల్లో వైసీపీ నాయకులు అక్రమ చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. ఈ చెరువుల వ్యవహారంపై తన కుమారుడు స్పందనలో కలెక్టర్‌కు పలు మార్లు ఫిర్యాదు చేశాడనే ఉద్దేశంతో ఈనెల 21న తాను నివశిస్తున్న శ్రీపర్రు, మాదేపల్లి గ్రామాలకు చాటపర్రుకు చెందిన కొంత మంది మహిళలు, యువకులు దాడికి యత్నించారని, ఇష్టానుసారం తిట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. దీనిపై రూరల్‌ పోలీస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నేటి వరకు ఎటు వంటి  చర్యలు తీసుకోలేదన్నారు. అంతేకాకుండా తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పారు. కొందరు తమను చంపుతామని సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టి బెదిరిస్తున్నారని అన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని తమకుటుంబ సభ్యుల కు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. 


Updated Date - 2022-06-28T04:55:42+05:30 IST