వెంకయ్యను రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి: Somireddy
ABN , First Publish Date - 2022-06-21T19:44:27+05:30 IST
భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అమరావతి: భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy chandramohan reddy) డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో ఎంతో మంది ఉపరాష్ట్రపతులను, రాష్ట్రపతిగా ఎన్నుకున్న సంప్రదాయం కొనసాగించాలన్నారు. వెంకయ్య నాయుడు రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి అని కొనియాడారు. వెంకయ్య నాయుడు పేరును ఎన్డీయే సిఫార్సు చేస్తే.. ఇతర పార్టీలు కూడా పోటీకి అభ్యర్థిని పెట్టేందుకు సాహసించవని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వచ్చి, అంశం వివాదం కావటం తగదని సోమిరెడ్డి అన్నారు.