మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లలో ఫిడేలు వాయించుకుంటున్నారా?: Somireddy

ABN , First Publish Date - 2022-03-23T18:00:39+05:30 IST

రైతులు ధాన్యం అమ్ముకోలేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లలో ఫిడేలు వాయించుకుంటున్నారా? అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లలో ఫిడేలు వాయించుకుంటున్నారా?: Somireddy

నెల్లూరు: రైతులు ధాన్యం అమ్ముకోలేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లలో ఫిడేలు వాయించుకుంటున్నారా? అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడవ స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఒక్క పంటలో కోటి టన్నులు సేకరించారని.... కేసీఆర్ మగాడని కొనియాడారు. ఏపీలో ముప్పై శాతం కూడా కొనుగోళ్లు జరగడం లేదని,  ఆరు నెలలు గడిచినా డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రధాని మోదిని ప్రశ్నించే దమ్ము ఏపీలో లేకుండా పోయిందని సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-03-23T18:00:39+05:30 IST