ఉద్యోగుల గొంతు కోశారు: టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి

ABN , First Publish Date - 2022-01-13T01:52:07+05:30 IST

రాష్ట్ర ప్రజలకు లక్ష అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి

ఉద్యోగుల గొంతు కోశారు: టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి

కడప: రాష్ట్ర ప్రజలకు లక్ష అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలో ఆయన మీడియాతో్ మాట్లాడారు. ఉద్యోగులను నమ్మించి గొంతు కోశారని ఆయన ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు హయాంలో 43 శాతం ఇచ్చారని ఆయన తెలిపారు. సచివాలయం ఉద్యోగులను రెండేళ్లలో ఫ్రొబేషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2022-01-13T01:52:07+05:30 IST