ఏపీ పరువు కేటీఆర్ వ్యాఖ్యలతో పోయింది: టీడీపీ నేత

ABN , First Publish Date - 2022-04-30T19:26:29+05:30 IST

ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడం ఎప్పుడూ జరగలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అన్నారు.

ఏపీ పరువు కేటీఆర్ వ్యాఖ్యలతో పోయింది: టీడీపీ నేత

కడప: ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడం ఎప్పుడూ జరగలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ పరువు తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో పోయిందన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రానికి రండి అభివృద్ధి చూపిస్తామని ఆహ్వానించండం ఏంటని ప్రశ్నించారు. టీఆరెస్ నేతలకు ఏం అభివృద్ధి చూపిస్తారు.. పెరిగిన విద్యుత్ కోతలు, అద్వాన్నంగా ఉన్న రోడ్లు, ఆగిపోయిన పోలవరం, ఇలా ప్రభుత్వ వైఫల్యాలను వారికి చూపిస్తార అని ఆయన నిలదీశారు. వచ్చిన విమర్శలను  సరిదిద్దే ప్రయత్నం చేయకుండా మళ్లీ వారిపైనే విమర్శలు చేయడమేంటని అడిగారు. సిగ్గులేని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమీలేని అభివృద్ధిని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇకనైనా ఎన్ని ఇబ్బందులు ఉన్న విద్యుత్ కొరత లేకుండా సరఫరా చేయాలని, దెబ్బతిన్న రోడ్లను బాగుచేయాలని శ్రీనివాసులు రెడ్డి హితవుపలికారు. 

Updated Date - 2022-04-30T19:26:29+05:30 IST