కరోనా నివారణపై అవగాహన కల్పించండి

ABN , First Publish Date - 2021-04-18T05:07:25+05:30 IST

పై ప్రజలకు అవగాహన కల్పించాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ శ్రేణులకు శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

కరోనా నివారణపై అవగాహన కల్పించండి

  1.  టీడీపీ శ్రేణులకు సోమిశెట్టి విజ్ఞప్తి 


కర్నూలు (అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 17: కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ శ్రేణులకు శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి, చేతనైనంత సహాయ సహకారాలు అందింస్తోందని అన్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో తమవంతుగా ప్రజలకు సహకారం అందించాలని సోమిశెట్టి నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-04-18T05:07:25+05:30 IST