రాష్ట్రంలో అరాచక పాలన: తిక్కారెడ్డి
ABN , First Publish Date - 2021-01-22T06:03:36+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి ఆరోపించారు.
మంత్రాలయం, జనవరి 21: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి ఆరోపించారు. గురు వారం మాట్లాడుతూ మాజీ మంత్రి, కళా వెంకట్రావు అరెస్టు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్యుడు, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒడిదుడుకులు లేని నాయకుడు కళా వెంకట్రావని, అటువంటి వ్యక్తిని పోలీ సులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజ సమన్నారు. వైసీపీ పాలనలో దాడులు, దౌర్జ న్యాలు తప్ప ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు.