వైసీపీ పతనం మొదలైంది.. ఉగ్ర నరసింహారెడ్డి
ABN , First Publish Date - 2022-05-28T22:48:44+05:30 IST
మహానాడు: వైసీపీ పతనం మొదలైందని టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. జగన్ చెత్త పాలనను చూసి జనం చీదరించుకుంటున్నారని.. పోలీసులు లేకుండా ‘గడప
మహానాడు: వైసీపీ పతనం మొదలైందని టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. జగన్ చెత్త పాలనను చూసి జనం చీదరించుకుంటున్నారని.. పోలీసులు లేకుండా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. మార్కాపురాన్ని జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. ఏపీకి రాజధాని కూడా లేకుండా చేసిన ఘనుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు.