ఏం ఘనకార్యాలు చేశారని సత్కారాలు: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2022-04-07T21:19:06+05:30 IST
రాష్ట్రంలో ఏం ఘనకార్యాలు చేశారని వలంటీర్లకు సేవా సత్కారాలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని
అమరావతి: రాష్ట్రంలో ఏం ఘనకార్యాలు చేశారని వలంటీర్లకు సేవా సత్కారాలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అధికార పార్టీకి సేవలందించినందుకు ప్రజల సొమ్ము దోచిపెడతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల సన్మానానికి ఫుల్ పేజి అడ్వర్టయిజ్ మెంటు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అడ్డగోలు దోపిడీకి సహకరించినందుకు, దొంగమద్యం అమ్మినందుకు సన్మానిస్తున్నారా అని ఆయన నిలదీశారు.