Yanamala ramakrishnudu: జగన్ ఏపీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు
ABN , First Publish Date - 2022-08-19T20:06:27+05:30 IST
జగన్ మోహన్ రెడ్డి దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.10లక్షల కోట్లు?... వాటిపై చెల్లింపుల భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు..? ఉండే అవకాశం ఉందని
అమరావతి: జగన్ మోహన్ రెడ్డి దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.10లక్షల కోట్లు?... వాటిపై చెల్లింపుల భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు..? ఉండే అవకాశం ఉందని శాసనమండలి ప్రధానప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు (Yanamala ramakrishnudu) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ లెక్కాజమా లేని అప్పులు ఏపీలో అగ్నికి ఆజ్యం అయ్యాయని తెలిపారు. ఈ అప్పుల బరితెగింపుపై కేంద్రం ఇంకెన్నాళ్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలుకన్నా సాక్షిలో వాటి ప్రకటనలకే జగన్ (CM Jagan) ప్రాధాన్యమిస్తారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదనే జగన్ రెడ్డి ఏపీ (Andhrapradesh)ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని, ఉపాధి కల్పన గుండుసున్నా అని... యువతలో అశాంతి నెలకొందని అన్నారు. బాధిత వర్గాల ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.