Yanamala ramakrishnudu: జగన్ పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోంది
ABN , First Publish Date - 2022-08-29T16:26:09+05:30 IST
జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి: జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు (Yanamala ramakrishnudu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగులను బైండోవర్ పరిధిలోకి తీసుకోవడం అనాగరిక చర్య అని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వారి శాంతియుత ఆందోళనను పోలీసులతో అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వాని (AP Government)కి ఉద్యోగులు తమ నిరసన తెలిపే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా చర్యలున్నాయని యనమల రామకృష్ణుడు (TDP Senior leader) విమర్శించారు.