కుమార స్వామి మృతి బాధాకరం: Yanamala
ABN , First Publish Date - 2022-03-02T19:35:09+05:30 IST
టీడీపీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్ వల్లూరి కుమారస్వామి మృతి బాధాకరమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్ వల్లూరి కుమారస్వామి మృతి బాధాకరమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కుమార స్వామి పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను ఆప్యాయంగా పలుకరించేవారన్నారు. ఆయన పార్టీకి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కుమారస్వామి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందిని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.