సారా మరణాలన్నీ జే-గ్యాంగ్ మద్యం మాఫియా హత్యలే: యనమల

ABN , First Publish Date - 2022-03-19T19:42:33+05:30 IST

సారా మరణాలన్నీ జే-గ్యాంగ్ మద్యం మాఫియా హత్యలే అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

సారా మరణాలన్నీ జే-గ్యాంగ్ మద్యం మాఫియా హత్యలే: యనమల

అమరావతి: సారా మరణాలన్నీ జే-గ్యాంగ్ మద్యం మాఫియా హత్యలే అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మూడేళ్లు పూర్తైనా తెలుగుదేశం ప్రభుత్వంపై పడి ఏడుపులు సిగ్గుచేటన్నారు. మూడేళ్ల మద్యం అమ్మకాలు, ఆదాయం, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పులు, వడ్డీలు, తాకట్టుల వివరాలు బయట పెట్టాలన్నారు. డిస్టిలరీలు, బ్రాండ్లు, టెండర్లు లేకుండా కొనుగోళ్లకు కారణాలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఆవ గింజలంటే.. తాటికాయల్లా ఉంటాయన్నట్లు పెగాసెస్‌పై జే - గ్యాంగ్ తీరు ఉందని వ్యాఖ్యానించారు. పెగాసెస్ అనేది ఏంటో తెలియని వేలిముద్రగాళ్లు కూడా పెగాసెస్‌ పై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమరావతిలో అవినీతి, కోడికత్తి, బాబాయి గొడ్డలివేటు జాబితాలో.. నేడు పెగాసెస్ అని తెలిపారు. అప్పులు, అక్రమ కేసులతో రాష్ట్ర పరువు రోడ్డు పాలు అవుతోందని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-03-19T19:42:33+05:30 IST