AP News: కారు డోర్ పగులగొట్టి.. టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు
ABN , First Publish Date - 2022-09-11T21:07:39+05:30 IST
గుడివాడ వెళుతున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
కృష్ణా జిల్లా (Krishna Dist.): గుడివాడ వెళుతున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కృష్ణా జిల్లా, పామర్రులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వారు కారులో నుంచి బయటకు దిగేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు కారు చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. టీడీపీ నేతలు మూడు గంటలపాటు కారు లోపలే ఉన్నారు. పోలీసులు కారు ఫ్రంట్ డోర్ విండోను రాయితో పగుల కొట్టి కారు లాక్ బ్రేక్ చేశారు. మీడియాను దూరంగా నెట్టేసి.. టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంధ్ర, బచ్చుల అర్జునుడులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh)లపై కొడాలి నాని (Kodali Nani) చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు గుడివాడ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు వెళ్తున్న క్రమంలో టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ.. గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతున్నారు. మీడియాపై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆంక్షలు విధించారు. కనీస మానవత్వాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.