TDP Leaders: అసెంబ్లీ సమీపంలో ఓ భవనం ఎక్కిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2022-09-20T16:01:49+05:30 IST
అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) ఎక్కారు.
అమరావతి (Amaravathi): అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) ఎక్కారు. ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) దళిత ద్రోహి అంటూ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను భవనంపై నుంచి బలవంతంగా కిందికి దించి అరెస్టు చేశారు.