Tirupathi: శ్రీవారి బ్రహ్మోత్సవాలా?...లేక జగనోత్సవాలా..?: టీడీపీ
ABN , First Publish Date - 2022-09-27T19:39:19+05:30 IST
తిరుపతి: నగరంలోని టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు (TDP Leaders Arrest) చేశారు
తిరుపతి (Tirupathi): నగరంలోని టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు (TDP Leaders Arrest) చేశారు. వారిని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ తిరుమతిలో జరుగుతున్నది శ్రీవారి బ్రహ్మోత్సవాలా?...లేక జగనోత్సవాలా..? అని ప్రశ్నించారు. తిరుపతిని ప్లెక్సీల రహిత నగరంగా తీర్చిదిద్దుతామని అధికారులు అన్నారని, ఇప్పుడిదేంటని నిలదీశారు. మహిళ యూనివర్సిటీ నుంచి అలిపిరి వరకు సీఎం జగన్ (CM Jagan) ప్లెక్సీలతో నింపేశారని విమర్శించారు.
సీఎం జగన్ కూడా ప్లాస్టిక్, ప్లెక్సీలు నిషేధిస్తామన్నారని, నిషేధం అంటే ఇదేనా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. తిరుపతిలో శ్రీవారి ప్లెక్సీలు లేకుండానే జగన్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తిభావంతో నిర్వహించాలి.. కానీ తిరుపతిలో శ్రీవారి భక్తులకు ఎక్కడా చూసినా జగనే కనిపిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై నిరసన తెలిపితే అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడమా? ఇదెక్కడి న్యాయమని అన్నారు. అరెస్టు చేసినవారిలో తిరుపతి టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్, కార్యకర్తలు, స్థానిక నేతలు ఉన్నారు.