టీడీపీ నేతల కుటుంబాలకు బీద, మాలేపాటి పరామర్శ
ABN , First Publish Date - 2022-08-11T03:23:59+05:30 IST
కావలి పట్టణ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోటా రమేష్, కావలి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు దావులూరి దేవకుమార్ కుటుంబ సభ్యులను బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడులు పరామర్శించారు.
కావలి, ఆగస్టు 10: కావలి పట్టణ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోటా రమేష్, కావలి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు దావులూరి దేవకుమార్ కుటుంబ సభ్యులను బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడులు పరామర్శించారు. కోటా రమేష్ తల్లి సరోజనమ్మ, దావులూరి దేవకుమార్ తల్లి కొండమ్మలు ఇటీవల మృతి చెందారు. దీంతో టీడీపీ నేతలు వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వారి వెంట టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్బాబు, జ్యోతి బాబూరావు, ఏగూరి చంద్రశేఖర్, పోతుగంటి శ్రీకాంత్, తటవర్తి వాసు, అబ్దుల్ రహీం, అక్కిలిగుంట సూర్యప్రకాష్, కోవూరు వెంకట నారాయణ, శానం హరి, పసుపులేటి పద్మ, ద్రోణాదుల వెంకట్రావు, తదితరులు ఉన్నారు.