ఎమ్మెల్సీ Duvvadaపై టీడీపీ నేతల ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-05-31T18:18:25+05:30 IST
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై తెలుగు దేశం నేతలు టెక్కలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై తెలుగు దేశం నేతలు టెక్కలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్పై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మాహుతి దళంగా మారితానని... అచ్చెన్నను టెక్కలి రోడ్లపై కొడతానని దువ్వాడ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.