AP News: గుడివాడలో టీడీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు
ABN , First Publish Date - 2022-09-30T16:33:22+05:30 IST
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును ఖండిస్తూ గుడివాడలో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
విజయవాడ: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును ఖండిస్తూ గుడివాడలో టీడీపీ శ్రేణులు(TDP Leaders) రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం ఉదయం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు (Konakalla narayanarao), మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు (Ravi venkateshwar rao) దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ... ఎన్టీఆర్ (NTR) తన దేవుడంటూ మాట్లాడే కొడాలి నాని (Kodali nani).. విశ్వవిద్యాలయం పేరు మార్పుపై స్పందించాలని అన్నారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పును సీఎం జగన్ సోదరి షర్మిల ఖండించిందని, కొడాలి నాని ఎందుకు మాట్లాడరని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిపాలన చేతకాని ప్రభుత్వం తుగ్లక్ జీవోలను విడుదల చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విమర్శించారు.