AP News: కొడాలి నాని దిష్టి బొమ్మ దగ్దం.. ఫోటోలకు చెప్పులతో కొట్టిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-09-11T18:25:49+05:30 IST

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: కొడాలి నాని దిష్టి బొమ్మ దగ్దం.. ఫోటోలకు చెప్పులతో కొట్టిన టీడీపీ నేతలు

గుంటూరు (Guntur): వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) వ్యాఖ్యలపై టీడీపీ నేతలు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ వద్ద టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కొడాలి నాని దిష్టి బొమ్మను టీడీపీ నేతలు దగ్ధం చేసి, ఫోటోలకు చెప్పులతో కొట్టారు. కొడాలి నాని, సీఎం జగన్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


ఈ సందర్భంగా కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ మహానుభావులు పుట్టిన జిల్లాలో కొడాలి లాంటి వెదవ పుట్టడం బాధకరమన్నారు. కొడాలి నాని లాంటి పిచ్చి కుక్క వల్ల కృష్ణ జిల్లాతో పాటు ఏపీ పరువు బజారున పడుతోందన్నారు. మహిళలపై సభ్యత, సంస్కారం లేకుండా వైసీపీ నేతలు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. మొరగని కుక్కలను మంత్రి పదవి నుంచి తప్పిస్తానని జగన్ రెడ్డి హెచ్చరించారని, జగన్ రెడ్డి హెచ్చరికలతో పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు మరల రోడ్డు మీదకు వచ్చాయని దుయ్యబట్టారు. కొడాలి నాని కుక్క లాగ మొరగడం మానుకోకపోతే కోసి గుంటూరు కారం పెడతామని టీడీపీ నేతలు హెచ్చరించారు.

Updated Date - 2022-09-11T18:25:49+05:30 IST