వల్లభనేని వంశీపై పాతూరి ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-10-24T21:36:27+05:30 IST
వల్లభనేని వంశీపై టీడీపీ నేత పాతూరి రామ్ప్రసాద్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప.గో.జిల్లా: వల్లభనేని వంశీపై పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం టీడీపీ నేత పాతూరి రామ్ప్రసాద్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బిక్షతో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకి సిగ్గుంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత విమర్శలు చేయాలన్నారు. చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన వంశీ క్షమాపణలు చెప్పాలని రామ్ప్రసాద్ చౌదరి డిమాండ్ చేశారు.