‘వైసీపీ పాలనలో రాష్ట్రం అథోగతి’

ABN , First Publish Date - 2022-01-22T05:01:32+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని టీడీపీ డోన్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

‘వైసీపీ పాలనలో రాష్ట్రం అథోగతి’
గౌరవ సభలో మాట్లాడుతున్న ధర్మవరం సుబ్బారెడ్డి

ప్యాపిలి, జనవరి 21: వైసీపీ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని టీడీపీ డోన్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని భోంచెర్వుపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ గౌరవ సభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిదని ఆరోపించారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడంలో సీఎం జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడ నిర్మించలేని ముఖ్యమంత్రి వెంటనే గద్డె దిగాలని సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు ఏ మాత్రం గౌరవం లేదని, ఇటువంటి ప్రభుత్వానికి  మహిళా లోకం తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం వైసీపీ పాలనలో గాడి తప్పిన రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు మరో సారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, డోన్‌ మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, నాయకులు విజయ్‌భట్టు, కృష్ణయ్య, శ్రీరాములు, కాంతారావు, ఖాజాపీర్‌, గార్లదిన్నే సుధాకర్‌, నల్లమేకలపల్లి సత్యం, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T05:01:32+05:30 IST