చిత్తూరు: టీడీపీ నేతల ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలు
ABN , First Publish Date - 2021-03-01T15:21:19+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో జిల్లా హైటెన్షన్ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్లు చేస్తున్నారు.
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో జిల్లా హైటెన్షన్ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్లు చేస్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయం, పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. చంద్రబాబు నాయుడు ధర్నాకు అనుమతి ఇవ్వని పోలీసులు...ఎక్కడిక్కడ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అయితే ధర్నా చేసి తీరుతామని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.