చంద్రబాబు, లోకేశ్‌ కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2022-01-22T05:12:43+05:30 IST

చంద్రబాబునాయుడు, లోకేశ్‌లు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఎప్పటిలానే ప్రజల పక్షాన పోరాటం చేయాలని టీడీపీ నాయకులు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

చంద్రబాబు, లోకేశ్‌ కోలుకోవాలని పూజలు
ప్రత్యేక దువా నిర్వహిస్తున్న టీడీపీ నేతు నసీర్‌ తదితరులు

గుంటూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): చంద్రబాబునాయుడు, లోకేశ్‌లు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఎప్పటిలానే ప్రజల పక్షాన పోరాటం చేయాలని టీడీపీ నాయకులు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్టేడియంరోడ్డులో తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక దువా కార్యక్రమం జరిగింది. ఈ ప్రార్థనల్లో నాయకులు ఎస్‌ఎస్‌పీ జాదా, హసన్‌ బాషా, పఠాన్‌ జమీర్‌, షేక్‌ ఖుద్దుస్‌, నాయబ్‌ రసూల్‌, భాసి, హుస్సేన్‌, వహీద్‌, జానీబాషా, షేక్‌ రఫీ, ఉస్మాన్‌, సయ్యద్‌ అన్వర్‌, జబీఖాన్‌, అమీన్‌, అఫ్రోజ్‌, జిలాని, బాబు ఇలాహీ బాజీ తదితరులు పాల్గొన్నారు.

వాసవిమాతకు మొక్కులు..

చంద్రబాబు, లోకేశ్‌లకు సంపూర్ణ ఆరోగ్యం కోసం  స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలతో పాటు 108 కొబ్బరికాయలు కొట్టి ఆర్యవైశ్య నాయకులు మొక్కులు మొక్కారు. కార్యక్రమంలో 35వ వార్డు కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌, నాయకులు కొనకళ్ల సత్యం, పెండేల విజయకుమార్‌, కొత్తూరి వెంకట్‌, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, తల్లం శేఖరబాబు, అన్నవరపు చక్రధర్‌, దొంతు మహేష్‌, తెడ్ల అయ్యప్ప, వలివేటి కృష్ణ, విజయకాంత్‌, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. 

యువత ఆధ్వర్యంలో....

చంద్రబాబు, లోకేశ్‌ ఆరోగ్యంతో ఉండాలంటూ తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు రావిపాటి సాయి నేతృత్వంలో మస్తాన్‌దర్గాలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో నాయకులు కొండెపు శేఖర్‌బాబు, మహ్మద్‌ ఆసీఫ్‌, మాచవరపు దాసు, అజయ్‌, గుంటి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-22T05:12:43+05:30 IST