నర్రవాడలో ‘బాదుడే బాదుడు’
ABN , First Publish Date - 2022-05-25T04:07:11+05:30 IST
మండలంలోని నర్రవాడ పంచాయతీలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
దుత్తలూరు, మే 24: మండలంలోని నర్రవాడ పంచాయతీలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలపై అన్నివిధాల ఆర్థికభారం పడిందన్నారు. అనంతరం అన్ని గ్రామాల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పెరిగిన ధరలపై కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకుర్తి రవీంద్రబాబు, చీదర్ల మల్లికార్జున, పులివర్తి వెంకటేశ్వర్లు, మధుసూదన్రెడ్డి, చల్లా ప్రసాద్, వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, చిన్న, పాముల మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.