అధికారంలోకి రాగానే.. ఆదీవాసీ సంక్షేమ జీవో అమలు..

ABN , First Publish Date - 2022-08-09T21:43:10+05:30 IST

టీడీపీ అధికారంలోకి రాగానే ఆదివాసీల సంక్షేమానికి సంబంధించిన జీవో నం.3ను అమలు చేస్తామని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. జిల్లా...

అధికారంలోకి రాగానే.. ఆదీవాసీ సంక్షేమ జీవో అమలు..

ఏలూరు: టీడీపీ అధికారంలోకి రాగానే  ఆదివాసీ సంక్షేమ జీవోను అమలు చేస్తామని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. జిల్లా పరిధిలోని కుక్కునూరు మండలంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో.. నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని, అందరూ ఒకే తాటిపై ఉండాలని పిలుపినిచ్చారు. గిరిజనుల సంక్షేమానికి  టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కుక్కునూరు మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు, గిరిజన నాయకులు కుంజా భద్రం, మడకం నాగేశ్వరావు, కుంజా రమేష్, కట్టం రాంబాబు, నూపా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-09T21:43:10+05:30 IST