వెంకన్నకు మొక్కు తీర్చుకున్న టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2022-01-23T04:44:28+05:30 IST
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని విద్యార్థి వ్యక్తిత్వ వికాసం నేర్పించాలని, జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి అన్నవరం ప్రభాకర్ పేర్కొన్నారు.
కడప(ఎడ్యుకేషన్), జనవరి 22: సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని విద్యార్థి వ్యక్తిత్వ వికాసం నేర్పించాలని, జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి అన్నవరం ప్రభాకర్ పేర్కొన్నారు. కడప నగరంలోని సీఎ్సఐ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్ఏఆర్డీఎ్స(సోషల్ యాక్టివిటీస్ ఫరల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ), యూనీసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్) ఆధ్వర్యంలో కడప మండల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఒ క్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు సమాజంపైన అవగాహన కల్పించడంతో పాటు, వ్యక్తిగత వికాసాలు క్రీడలు, సాంస్కృతిక తదితర వంటి వాటిపై వి ద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులకు అవగాహన క ల్పించి విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాలన్నారు. ఎంఈవో నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రత పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎన్జీవో ప్రెసిడెంట్ సునీల్కుమార్ మాట్లాడారు. ఏఎంఓ ధనలక్ష్మి, మీకోసం సేవాసమితి నిర్వాహకులు విష్ణువర్థన్, ఎస్ఏఆర్డీఎస్ ప్రాజెక్టు మేనేజర్ సాయి శిరీష్, ఎస్ఏఆర్డీఎస్ కోఆర్డినేటర్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.