చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతల పూజలు

ABN , First Publish Date - 2022-01-20T19:03:06+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతల పూజలు

ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి) : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లాలోని  ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు లంక సత్తిపండు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ... చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ త్వరగా కోలుకోవాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T19:03:06+05:30 IST