AP News: జాబ్ ఎక్కడ? జగన్ ఎక్కడ? అంటూ టీడీపీ నినాదాలు..

ABN , First Publish Date - 2022-09-15T18:38:04+05:30 IST

అమరావతి (Amaravathi): అసెంబ్లీ మండలికి టీడీపీ నేతలు (TDP Leaders) ర్యాలీగా వెళ్లారు.

AP News: జాబ్ ఎక్కడ? జగన్ ఎక్కడ? అంటూ టీడీపీ నినాదాలు..

అమరావతి (Amaravathi): అసెంబ్లీ, మండలికి టీడీపీ నేతలు (TDP Leaders) ర్యాలీగా వెళ్లారు. నిరుద్యోగ సమస్యపై ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ‘జాబ్ ఎక్కడ?, జగన్ ఎక్కడ?’ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలండర్ అని ప్రకటించిన జగన్ ప్రభుత్వం జాబ్‌లెస్ క్యాలండర్‌గా మారిందంటూ టీడీపీ నేతలు నిరసన తెలిపారు. జగన్ రెడ్డి యువతను మోసం చేశారన్నారు. ‘జాబ్ రావాలంటే.. జగన్ పోవాలి’ అంటూ నినాదాలు చేశారు.


అంతకుముందు వెంకటపాలెంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అందరూ అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. ఈ సందర్బంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల మూడు నెలల కాలంలో చూస్తే.. నిరుద్యోగ సమస్య అత్యంత తీవ్రమైందని, యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని నిమ్మల రామానాయుడు అన్నారు.

Updated Date - 2022-09-15T18:38:04+05:30 IST