‘అమూల్పై ప్రేమతోనే ధూళిపాళ్ల అక్రమ అరెస్ట్’
ABN , First Publish Date - 2021-04-24T05:22:41+05:30 IST
సంగం డె ౖరీని అమూల్లో విలీనం చే యాలన్న కుతంత్రంతోనే చై ర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను ప్ర భుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని టీడీపీ తాడేపల్లిగూ డెం నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మండిపడ్డారు.
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : సంగం డె ౖరీని అమూల్లో విలీనం చే యాలన్న కుతంత్రంతోనే చై ర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను ప్ర భుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని టీడీపీ తాడేపల్లిగూ డెం నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ అవినీ తి, అక్రమాలపై మాట్లాడుతున్న తమ పార్టీ నేతలందరినీ ఒక్కొక్కరిగా అరె స్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బలహీనవర్గాలకు చెందిన నేతలైన అచ్చెన్ననాయుడు, కొల్లు రవీంద్ర, కూన రవికుమార్లను గతంలో అరెస్ట్ చేయడాన్ని గుర్తుచేశారు. కరోనా వల్ల టీడీపీ శ్రేణులు సంయమనం పా టిస్తున్నాయని, లేదంటే అక్రమ అరెస్ట్లను నిరశిస్తూ తమ సత్తా ఏమిటో చూపేవారమని స్పష్టం చేశారు. గ్రామంలో భయభ్రాంతులకు గురిచేయడ మే కాకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నరేంద్రను అరెస్ట్ చేయ డాన్ని తాడేపల్లిగూడెం టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపా రు. నర్సాపురం పార్లమెంటరీ రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి మాట్లాడుతూ సంగం డైరీని అమూల్ సంస్థలో విలీనం చేయాలని ప్రయ త్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగి న బుద్ధి చెబుతారన్నారు. మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్ పాల్గొన్నారు.