17వ వార్డులో బాదుడే బాదుడు
ABN , First Publish Date - 2022-08-10T04:15:29+05:30 IST
పట్టణంలోని 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
కందుకూరు, ఆగస్టు 9: పట్టణంలోని 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్కు పూర్వవైభవం రావాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్వీ సుబ్బారావు, రాయి వెంకటేశ్వర్లు, దివి శ్రీనివాసరావు, మట్టె రామారావు, ముచ్చు శ్రీను, కల్లూరి శైలజ, తానికొండ ప్రవీణ్, రామలింగయ్య, దివి కోటేశ్వరరావు, చేకూరి కృష్ణ, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.