మహానాడుకు తరలి వెళ్లిన టీడీపీ నాయకులు

ABN , First Publish Date - 2022-05-28T06:46:14+05:30 IST

ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తలుపుల మండలం నుంచి ఆ పార్టీ స్థానిక నాయకులు పలువురు తరలివెళ్లారు.

మహానాడుకు తరలి వెళ్లిన టీడీపీ నాయకులు
తలుపులలో మహానాడుకు వెళ్తున్న టీడీపీ నాయకులు

తలుపుల, మే27:  ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తలుపుల మండలం నుంచి ఆ పార్టీ స్థానిక నాయకులు పలువురు తరలివెళ్లారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కంది కుంట వెంకటప్రసాద్‌ ఆదేశాల మేరకు మండల కన్వీనర్‌ ముబారక్‌, నా యకులు శ్రీనివాసులు, లగిడి జయచంద్ర, నారాయణరెడ్డి, గంగరాజు, పక్కీరప్ప, రమేష్‌, కార్యకర్తలు వివిధ వాహనాలలో తరలి వెళ్లారు.

నల్లమాడ: ఒంగోలులో జరుగుతున్న మహానాడు వేడుకలకు  మండలం నుంచి పెద్దఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారు తరలివెళ్లారు. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు నల్ల మాడ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 50 వాహనాలలో తరలి వెళ్లారు. మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, మాజీ కన్వీనర్‌ కేశవరెడ్డి, వెంకటరమణనాయుడు, గంగులప్పనాయుడు, మైలే రామచంద్ర, సలాంఖాన, రాజారెడ్డి, పులగంపల్లి సర్పంచ ప్రభాకర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.



Updated Date - 2022-05-28T06:46:14+05:30 IST