రమణమ్మను పరామర్శించిన టీడీపీ నాయకులు

ABN , First Publish Date - 2022-05-27T07:02:36+05:30 IST

వైసీపీ నాయకుల రాళ్ల దాడిలో గాయపడిన తిరగళదిన్నె తెలుగు మహిళా నాయకురాలు ఆవుల రమణమ్మను గురు వారం టీడీపీ నాయకులు పరామర్శించారు.

రమణమ్మను పరామర్శించిన   టీడీపీ నాయకులు
రమణమ్మకు సాయం అందిస్తున్న పువ్వాడి

పామూరు, మే 26 : వైసీపీ నాయకుల రాళ్ల దాడిలో గాయపడిన తిరగళదిన్నె  తెలుగు మహిళా నాయకురాలు ఆవుల రమణమ్మను గురు వారం టీడీపీ నాయకులు పరామర్శించారు. మంగళవారం తిరగలదిన్నె గ్రామంలో వైసీపీ నాయకుల రాళ్లతో దాడి చేసి రమణమ్మను గాయ పరిచిన విషయం తెలిసిందే. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అనంతరం ఆమె ఇంటి చేరారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యం చెప్పారు. వైసీపీ రాక్షస పాలనకు ప్రజలే చరమ గీతం పాడతారన్నారు. టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు ఆర్థిక సాయం అందజేశారు.  పరామర్శించిన వారిలో కె.సుభాషిణి, పట్టణాఽ ద్యక్షుడు ఖాజారహంతుల్లా, ఎం.రమణయ్య, దేవరపు మల్లాద్రి, ఎంపీటీసీ సభ్యుడు బొల్లా నరసింహారావు, రమాదేవి, రహీమున్నిసా, నూర్‌బీ,  సుబ్బమ్మ ఉన్నారు. 


Updated Date - 2022-05-27T07:02:36+05:30 IST