ఆనెమడుగు యువత టీడీపీలో చేరిక
ABN , First Publish Date - 2022-06-29T03:09:15+05:30 IST
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కావలి రూరల్ మండలం ఆనెమడుగుకు చెందిన పలువురు యువకులు మంగళవారం టీడీపీలో చేరారు,
కావలి, జూన్ 28: తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కావలి రూరల్ మండలం ఆనెమడుగుకు చెందిన పలువురు యువకులు మంగళవారం టీడీపీలో చేరారు, పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, తుళ్లూరు మల్లికార్జున్, పొంతగాని వసంతకుమార్ సారధ్యంలో చేరిన వారికి కావలి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ కండువాలు వేసి సాధర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ మీకు ఎల్లప్పుడూ పార్టీ అండ, తన సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను, ఆశయాలను తెలియచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోసూరు వెంకటేశ్వర్లు, ఉప్పాల వెంకయ్య, శ్రీనివాసులు, టీ.సుధాకర్, ఉప్పాల మాలకొండయ్య, శివయ్య, నాసిన జ్వాలరావు, తాతా హరిబాబు, పెనుబాపల వెంకటేశ్వర్లు, రమణయ్య, రవిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.