గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం ఫలించింది: లోకేష్
ABN , First Publish Date - 2021-06-17T03:49:11+05:30 IST
గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం ఫలించింది: లోకేష్
అమరావతి: గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం ఫలించిందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమన్నారు. గ్రూప్-1 పరీక్షల్లో జగన్రెడ్డి అండ్ గ్యాంగ్ అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి చేసిన కుట్ర బహిర్గతమైందని మండిపడ్డారు. విజయానికి ఇది మొదటి మెట్టు, ఆఖరికి న్యాయమే గెలుస్తుందన్నారు. అభ్యర్థులంతా ధైర్యంగా ఉండాలని లోకేష్ సూచించారు. అర్హులైన వారికే ఉద్యోగాలు అనే డిమాండ్తో తమ పోరాటం కొనసాగిద్దామన్నారు.