TDP మహానాడు ప్రారంభం..
ABN , First Publish Date - 2022-05-27T16:34:27+05:30 IST
తెలుగు దేశం పార్టీ మహాపండుగ మహానాడు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.
ప్రకాశం: తెలుగు దేశం పార్టీ మహాపండుగ మహానాడు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలం చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి మహానాడు ఉత్సవాన్ని ప్రారంభించారు. 3 ఏళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. మహానాడుకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. మహానాడు ప్రాంగణంలో 40 ఏళ్లలో పార్టీ పరిణామాలపై ఫొటో గ్యాలరీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫొటోల గ్యాలరీని ప్రదర్శించారు. కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఆహ్వానితులే కాకుండా సామాన్య ప్రజలు భారీగా తరలివస్తున్నారు. మహానాడులో మొత్తం 17 తీర్మానాలను టీడీపీ ప్రవేశపెట్టనుంది.