Mahanaduకు అడుగడుగునా అడ్డంకులు.. ప్రభుత్వ తీరుపై TDP శ్రేణుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-25T16:22:11+05:30 IST

ఒంగోలులో ఈనెల 27, 28న జరగనున్న టీడీపీ మహానాడుకు వైపీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.

Mahanaduకు అడుగడుగునా అడ్డంకులు.. ప్రభుత్వ తీరుపై TDP శ్రేణుల ఆగ్రహం

ప్రకాశం: ఒంగోలులో ఈనెల 27, 28న జరగనున్న టీడీపీ మహానాడు(TDP Mahanadu)కు వైపీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం గ్రౌండ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే మహానాడుకు కార్యకర్తలు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేమని  ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. స్కూల్ బస్సులు, ప్రైవేటు బస్సులు కూడా పంపొద్దని ట్రావెల్స్ యజమానులకు ఆర్టీఏ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఒంగోలు చర్చి సెంటర్‌లో కట్టిన టీడీపీ తోరణాలు కార్పోరేషన్ అధికారులు తొలగించారు. దీంతో ప్రభుత్వ తీరుపై  టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

Updated Date - 2022-05-25T16:22:11+05:30 IST