మాజీ మంత్రి అనిల్‌ ప్రోద్బలంతోనే దాడి

ABN , First Publish Date - 2022-05-27T04:37:27+05:30 IST

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రోద్బలంతోనే నాపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆరోపించారు.

మాజీ మంత్రి అనిల్‌ ప్రోద్బలంతోనే దాడి
మాట్లాడుతున్న రేవతి

టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు రేవతి

నెల్లూరు(వైద్యం), మే 26 : మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రోద్బలంతోనే నాపై దాడి జరిగిందని తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆరోపించారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనపై దాడి చేసే సమయంలో ఇద్దరు మహిళలు అసభ్య పదజాలంతో దూషిస్తూ అనిల్‌ కుమార్‌ నీ గొంతు కోయమని చెప్పారని అన్నారన్నారు. మాజీ మంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసులను వేడుకున్నా వారు పట్టించు కోలేదన్నారు. తనపై దాడి చేసి మళ్లీ తనపైనే తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. ఆడదాన్ని కొట్టించిన చరిత్ర హీనుడుగా అనిల్‌ మిగిలి పోతారన్నారు. అనిల్‌కు తల్లి, చెల్లి లేదా అని ప్రశ్నించారు. తనకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కుమారి విజయం, సుశీలమ్మ, గోడ పద్మ, మంగమ్మ, శ్రీదేవి, పద్మ, అనిత, లతా, తులసీ, అమ్ములు, సోనీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T04:37:27+05:30 IST