వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేయాలి
ABN , First Publish Date - 2021-03-06T06:16:28+05:30 IST
ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ అనుసరిస్తున్న అక్రమాలను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావడంతో పాటు, ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయాలని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు.
గుంటూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ అనుసరిస్తున్న అక్రమాలను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావడంతో పాటు, ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయాలని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్కుమార్ తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం గుంటూరు కార్పొరేషన్ డివిజన్లకు నియమితులైన పరిశీలకులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాయకులు, కార్యకర్తలు మేయర్ పీఠమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్ ఓటర్ లిస్ట్ మీద అవగాహన కలిగేటట్లుగా తగిన సమాచరం ఆందిస్తున్నామన్నారు. పరిశీలుకు డివిజన్లలో బూత్ స్థాయి వరకు పనిచేయించాలన్నారు. సమావేశంలో నాయకులు దామినేని శ్రీనివాసరావు, కంచర్ల శివరామయ్య, నార్నె శ్రీనివాసరావు, గుంటుపల్లి మధుసూదనరావు, ఎన్నికల పరిశీలుకులు బండ్లమూడి జ్యోతిబాబు, తాటి శంకర్, మాదాల రామకృష్ణ, తాళ్ల శ్రీనివాసరావు, బొల్లెద్దు సుశీలరావు, సాలడుగు అంజయ్య, బడల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.