‘టీడీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి’
ABN , First Publish Date - 2021-03-01T05:15:53+05:30 IST
గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతానికి నాయకు లు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.
దేవరపల్లి, ఫిబ్రవరి 28: గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతానికి నాయకు లు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. యాదవోలులో టీడీపీ సీనియర్ నేత అనిశెట్టి ప్రభాక రావు నివాసం వద్ద ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మండల పరిషత్ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థుల విజయం కోసం సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం సర్పంచ్లు, వార్డుల సభ్యులను ఘ నంగా సన్మానించారు. టీడీపీ మండల అధ్యక్షుడు చినబాబు, నాయకులు శ్రీనివా స్, సుంకర దుర్గారావు, ఎలేటి సత్యనారాయణ, కరుటూరి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.