టీడీపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి: బీకే
ABN , First Publish Date - 2022-08-20T04:54:11+05:30 IST
టీడీపీ సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.
రొద్దం, ఆగస్టు 19: టీడీపీ సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలం ఆర్ మరువపల్లిలోని ఆయన స్వగ్రామంలో నాయకులు, కార్యకర్తల సమావే శం నిర్వహించారు. సభ్యత్వ నమోదు చేసుకుంటే... ఏదైనా ప్రమాదం జరిగితే బీమా అం దజేస్తామన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పార్టీ సభ్యత్వాన్ని చేపట్టాలన్నారు. రాష్ట్రంలోనే పెనుకొండ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలన్నారు. సమావేశంలో హిందూపురం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, కన్వీనర్ నరహ రి, మాజీ వైస్ ఎంపీపీ నరసింహులు, పెనుకొండ నియోజకవర్గ టీఎనటీయూసీ అధ్యక్షు లు చంద్రశేఖర్, మోహనకుమార్, మురళి, చంద్రశేఖర్ నాయుడు, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : మండలంలోని మండ్లి గ్రామంలో టీడీపీ సభ్యత్వనమోదు వేగవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బీకే పార్థసారథి పేర్కొన్నారు. గ్రామంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదుపై సమీక్షించారు. కార్యక్రమంలో మండట టీడీపీ కన్వీనర్ సిద్దలింగప్ప, నాయకులు పాల్గొన్నారు.