జగన్ రెడ్డి రౌడీస్వామ్య పాలన సాగిస్తున్నారు: Anagani

ABN , First Publish Date - 2022-01-13T19:14:03+05:30 IST

జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి, రౌడీస్వామ్య పాలన సాగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

జగన్ రెడ్డి రౌడీస్వామ్య పాలన సాగిస్తున్నారు: Anagani

అమరావతి: జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి, రౌడీస్వామ్య పాలన సాగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద్రయ్యను హత్య చేసి మరో బీసీ నాయకుడ్ని బలితీసుకున్నారన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై విచక్షణారహితంగా హత్య చేశారంటే అర్ధం ఏంటి అని ప్రశ్నించారు. అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు సమాజంలో తిరుగుతున్నాయా అని అనిపిస్తోందన్నారు. క్రూరమృగాలు సమాజంలో ఉంటే ప్రమాదమని,  టీడీపీ అధికారంలోకి వచ్చాక మనుషుల ప్రాణాలు తీసే మృగాల్ని ‎అడవుల్లోకి  తరుముతామని అనగాని హెచ్చరించారు. 

Updated Date - 2022-01-13T19:14:03+05:30 IST