Chintamaneni prabhakar: అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది
ABN , First Publish Date - 2022-09-18T17:49:53+05:30 IST
అమరావతి తాత్కాలిక రాజధాని కాదని.. శాశ్వత రాజధానిగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఏలూరు: అమరావతి తాత్కాలిక రాజధాని కాదని.. శాశ్వత రాజధానిగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni prabhakar) స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు ముక్కల వ్యక్తులు మూడు ముక్కలతోనే పోతారన్నారు. ప్రాంతీయ విబేధాలు వచ్చేలా ప్రజలను ఈ ప్రభుత్వమే(AP government) రెచ్చగొడుతుందని మండిపడ్డారు. టీడీపీ (TDP)పై ఆ నెపం వేస్తూ, వంద సార్లు అబద్ధం చెబితే, నిజం అవుతుందనే భావన సరికాదన్నారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మార్చుతారని చింతమనేని ప్రభాకర్ (TDP MLA) ప్రశ్నించారు.