ఏడాదిగా గుడ్డుపై ఈకలు పీకుతున్నారా?'
ABN , First Publish Date - 2021-06-17T17:14:54+05:30 IST
16 నెలలు జైల్లో ఉండొచ్చిన నువ్వెక్కడ.. పుట్టుకతోనే రాజవంశీకులు ఆయన ఎక్కడ?...
విశాఖపట్నం : మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి ఎంపీ విజయసాయి రెడ్డికి లేదని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘16 నెలలు జైల్లో ఉండొచ్చిన నువ్వెక్కడ.. పుట్టుకతోనే రాజవంశీకులు ఆయన ఎక్కడ? మాన్సాస్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నావు. ఏడాదిగా నువ్వు నియమించిన తొత్తు చైర్మన్గా ఉంది కదా.. అప్పుడు అక్రమాలు కనబడలేదా? ఏడాదిగా కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారా?’’ అని ప్రశ్నించారు.