టీడీపీ కార్యకర్తలను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-04-22T06:09:11+05:30 IST

టీడీపీ కార్యకర్తలను ఆదుకుంటాం

టీడీపీ కార్యకర్తలను ఆదుకుంటాం
స్వర్ణగౌరికి నగదు, వస్ర్తాలు అందజేసి ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే గద్దె

భారతీనగర్‌, ఏప్రిల్‌ 21 : టీడీపీ కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. బుధవారం మూడవ డివిజన్‌లోని టీడీపీ మహిళా కార్యకర్త వెలటూరు స్వర్ణగౌరి వివాహం సందర్భంగా ఎమ్మెల్యే  28వేల నగదుతో పాటు నూతన వస్ర్తాలు బహూకరించారు.  ఆయనతో పాటు 10 డివిజన్‌ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ 5 వేల నగదుతో పాటు నూతన వస్ర్తాలు అందజేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా నిలబడతామన్నారు. కార్యకర్తల అభ్యున్నతికి సాయమంది స్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చలసాని వాసు, గద్దె రమేష్‌, సూరపనేని శేషసాయి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T06:09:11+05:30 IST