భవిష్యత్తులో జగన్ భారీ మూల్యం చెల్లించక తప్పదు: నిమ్మల
ABN , First Publish Date - 2021-04-23T17:46:59+05:30 IST
ప్రపంచం అంతా కరోనా చుట్టూ తిరుగుతుంటే, జగన్ కక్షలు, కార్పణ్యాలు, అరెస్టులు చుట్టూ తిరుగుతున్నాడని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏలూరు: ప్రపంచం అంతా కరోనా చుట్టూ తిరుగుతుంటే, జగన్ కక్షలు, కార్పణ్యాలు, అరెస్టులు చుట్టూ తిరుగుతున్నాడని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగం డైరీని అమూల్కు అప్పగించకుండా అడ్డుకుంటున్నాడనే టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రను అక్రమంగా అరెస్టు చేసారని ఆరోపించారు. జగన్ను అంతా ధైర్యవంతుడు అనుకుంటున్నారు కానీ ఆయన పిరికివాడన్నారు. ఫ్యాక్షనిస్టు ధోరణితో టీడీపీ నేతలను అణగదొక్కాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ఆయన భారీ మూల్యం చెల్లించక తప్పదని నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.