సోమవారం రాష్ట్రపతిని కలుస్తాం: Payyavula
ABN , First Publish Date - 2021-10-23T19:22:28+05:30 IST
ఈనెల 25(సోమవారం)న మధ్యాహ్నం 12.30 కి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలువనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు.
అమరావతి: ఈనెల 25(సోమవారం)న మధ్యాహ్నం 12.30 కి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలువనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రపతి పాలన ఆవశ్యకతను రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వ్యవస్థలపై జరుగుతున్న దాడులు, ఆర్థిక పతనంపై రాష్ట్రపతికి నివేదిక ఇస్తామని తెలియజేశారు. నిన్న జరిగిన ఘటన ఒక పరాకాష్ట అని..పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంపై అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. కేసు నమోదు చేయడానికి పోలీసులు భయపడుతున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి అన్ని సంఘటనలూ బయటికి తీస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు.