సోదాలు రాజకీయ కుట్రే: ఎమ్మెల్యే పయ్యావుల
ABN , First Publish Date - 2021-12-11T00:32:18+05:30 IST
లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగిన ఏపీ సీఐడీ సోదాలను
అమరావతి: లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగిన ఏపీ సీఐడీ సోదాలను రాజకీయ కుట్రగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకుండా లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యగా కనబడుతోందన్నారు. దీనివల్ల కుటుంబం భయబ్రాంతులకు గురి కావడం తప్ప ఏమీ లేదన్నారు. అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ను వదిలేసి డైరెక్టర్ను మాత్రమే టార్గెట్ చేయడం రాజకీయ కుట్రేనన్నారు.
చంద్రబాబు నాయుడును టార్గెట్గా చేసుకొని లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఏదో అవినీతి జరిగినట్లు భావించి ఈ సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుత చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేస్ నమోదు చేసి లక్ష్మి నారాయణను అరెస్ట్ చేయడానికి వచ్చారన్నారు.