సజ్జల అబద్ధాలు చెప్పటం తగదు: ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2021-11-16T00:46:16+05:30 IST

ప్రజాధనంతో జీతం తీసుకుంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల

సజ్జల అబద్ధాలు చెప్పటం తగదు: ఎమ్మెల్యే నిమ్మల

చిత్తూరు: ప్రజాధనంతో జీతం తీసుకుంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక‌ృష్ణారెడ్డి అబద్ధాలు చెప్పటం తగదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కుప్పంలో గెలవడానికి వైసీపీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈసీని తమ చేతుల్లో పెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని నిమ్మల ఆరోపించారు. దొంగ ఓట్లపై వైసీపీకే  పేటెంట్ అని ఆయన ఎద్దేవా చేశారు. దొంగ ఓట్ల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించొచ్చని ఆయన సూచించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైందని నిమ్మల పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-16T00:46:16+05:30 IST